ప్రశాంత్ కిశోర్ ఎవరు?.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
- ఆయనెవరో నాకు తెలియదు
- అప్పట్లో నేను బీజేపీలో లేను
- స్పష్టం చేసిన మంత్రి హర్దీప్ సింగ్ పూరి
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు తెలియనివారు ఉండరు. దేశంలోని ఎన్నో పార్టీలు ఇప్పుడు ఆయన వెంట పడుతున్నాయి. ప్రశాంత్ కిశోర్ తమ వెంట ఉంటే విజయం ఖాయమని నమ్ముతున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఆయన పనిచేశారు. అనేక వ్యూహాలతో బీజేపీని అందలం ఎక్కించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఆయన పనిచేస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిశోర్ ఎవరో తనకు తెలియదంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ప్రశాంత్ కిశోర్ ఎవరు? ఆయనను నేనెప్పుడూ చూడలేదు’ అని మంత్రి పేర్కొన్నారు. ‘ఆయనెవరో మీకు తెలియదా? 2014 ఎన్నికల్లో మీ గెలుపు కోసం పనిచేశారుగా, గుర్తుకు తెచ్చుకోండి’ అని మీడియా ప్రతినిధులు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన సమాధానంగా.. అప్పట్లో తాను బీజేపీలో లేనని, కాబట్టి ఆ విషయం తనకు తెలియదని తేల్చి చెప్పారు. దీంతో విస్తుపోవడం మీడియా ప్రతినిధుల వంతైంది.
‘ప్రశాంత్ కిశోర్ ఎవరు? ఆయనను నేనెప్పుడూ చూడలేదు’ అని మంత్రి పేర్కొన్నారు. ‘ఆయనెవరో మీకు తెలియదా? 2014 ఎన్నికల్లో మీ గెలుపు కోసం పనిచేశారుగా, గుర్తుకు తెచ్చుకోండి’ అని మీడియా ప్రతినిధులు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన సమాధానంగా.. అప్పట్లో తాను బీజేపీలో లేనని, కాబట్టి ఆ విషయం తనకు తెలియదని తేల్చి చెప్పారు. దీంతో విస్తుపోవడం మీడియా ప్రతినిధుల వంతైంది.