YSRCP: రాజధాని రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారు: వాసిరెడ్డి పద్మ

  • జీఎన్ రావు కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించింది
  • రాజధాని పేరుతో మోసం చేసింది చంద్రబాబే
  • నాలుగైదు తాత్కాలిక భవనాలు కట్టి గ్రాఫిక్స్ చూపించారు
  • టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది

అమరావతి రాజధాని రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించిందని చెప్పారు. రాజధాని పేరుతో మోసం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆమె ఆరోపించారు.

టీడీపీ పాలనలో అమరావతిలో నాలుగైదు తాత్కాలిక భవనాలు కట్టి గ్రాఫిక్స్ చూపించారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అటువంటి పనులు చేయట్లేదని తెలిపారు. టీడీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.

More Telugu News