amaravathi: ఏపీ సచివాలయం మార్గాన్ని దిగ్బంధించిన మందడం రైతులు.. ఉద్రిక్తత

  • రాజధానిపై రైతుల ఆందోళన తీవ్రతరం
  • రోడ్డుపై బైఠాయించి నిరసన 
  • భారీగా మోహరించిన పోలీసులు

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్నాళ్లుగా చేస్తున్న రైతుల ఆందోళనలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మందడం రైతులు సచివాలయానికి వెళ్లే దారిలో బైఠాయించి రోడ్డును బ్లాక్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రైతులు, మహిళలు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో సచివాలయానికి వెళ్లే మార్గం మూసుకుపోయింది. వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాహనాల రాకపోకలను అడ్డుకుంటే అరెస్టు చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై రైతులు కూడా తీవ్రంగానే స్పందించారు. టెంటు వేసుకునేందుకు అనుమతిస్తే తాము రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడంతో పోలీసులు అందుకు అంగీకరించారు.

More Telugu News