Nikhil: 'కార్తికేయ 2'లోను 'కలర్స్' స్వాతి

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • వచ్చేనెలలో సెట్స్ పైకి సీక్వెల్ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ కథానాయకుడిగా చేసిన 'కార్తికేయ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా ఈ సినిమా చందూ మొండేటికి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో నిలిచింది. ఆ సినిమాలో 'కలర్స్' స్వాతి డాక్టర్ గా నటించింది. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సీక్వెల్లో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ పేరు వినిపిస్తోంది. మరో కీలకమైన పాత్ర కోసం 'కలర్స్' స్వాతిని తీసుకున్నట్టు సమాచారం. న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా ఆమె కనిపించనుందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకి చేరుకున్నాయి. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News