BJP: సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు పట్ల స్పందించిన రాష్ట్రపతి

  • సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ విజయసాయి ఫిర్యాదు
  • ఈ ఫిర్యాదును హోం శాఖకు పంపామన్న రాష్ట్రపతి 
  • సంబంధిత శాఖలకు హోం శాఖ పంపినట్టు సమాచారం

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుజనా చౌదరి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ రాసిన ఈ లేఖపై రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఇందుకు సంబంధించిన లేఖ విజయసాయికి వచ్చింది. రాష్ట్రపతి ఆఫీస్ నోట్ తో రీడైరెక్ట్ కావడంతో ఆ లేఖను సంబంధింత శాఖలకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపినట్టు సమాచారం. కాగా, సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలని తన లేఖలో విజయసాయిరెడ్డి కోరారు.

More Telugu News