kcr: రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

  • క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రబోధిస్తుంది
  • ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటారు
  • తెలంగాణ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలి

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రబోధిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంతోషంగా క్రిస్మస్ జరుపుకుంటారని, తెలంగాణ ప్రజలు కూడా సుఖసంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆయన అన్నారు.

క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 2.35 లక్షల పేద క్రిస్టియన్‌ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాకెట్లను అందజేస్తుంది. కాగా, ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా డిసెంబర్‌ 25న జరుపుకునే క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలోని చర్చిలను రంగు రంగుల లైట్లతో, క్రిస్మస్‌ ట్రీలతో అలంకరించారు.

More Telugu News