warangl: హన్మకొండలో దారుణం.. బాలికను అపహరించి అత్యాచారం

  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను తీసుకెళ్లిన యువకుడు
  • అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిన నిందితుడు
  • అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు

వరంగల్‌లో మరో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను అపహరించిన యువకుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. హన్మకొండ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని శాయంపేట మండలం కొప్పులకు చెందిన ఎం.వంశీ (22) కూలి పనులు చేసుకుంటూ గుండ్ల సింగారంలో ఉంటున్నాడు.

హన్మకొండకు చెందిన 13 ఏళ్ల బాలికతో ఇటీవల వంశీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని భావించిన నిందితుడు పెళ్లి చేసుకుందామంటూ ఈనెల 19న ఆమెను వెంట తీసుకెళ్లాడు. బస్సులో కొప్పులకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం మరుసటి రోజు రాత్రి బాలికను తిరిగి హన్మకొండ తీసుకొచ్చి ఆమె ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు. విషయం ఆరా తీసిన తల్లిదండ్రులకు బాలిక అసలు విషయం చెప్పింది. అప్పటికే కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత బాలిక తల్లిదండ్రులు విషయాన్ని పోలీసులకు చెప్పారు. నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

More Telugu News