Disha: న్యాయవ్యవస్థ కళ్లుగప్పి చేసిన దారుణ హత్యలే దిశ ఎన్ కౌంటర్: మంద కృష్ణ

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్
  • మంద కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు
  • త్రిసభ్య కమిషన్ ను స్వాగతిస్తున్నామని వెల్లడి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తీవ్రస్థాయిలో స్పందించారు. అగ్రకులాల మహిళలకు ఓ న్యాయం, పేద దళితులకు మరో న్యాయమా? అంటూ మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ కళ్లుగప్పి చేసిన దారుణ హత్యలే ఈ ఎన్ కౌంటర్ అని ఆరోపించారు. దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం తర్వాత వాస్తవం వెల్లడవుతుందని అన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ ను స్వాగతిస్తున్నామని మంద కృష్ణ తెలిపారు.

More Telugu News