Narayana: నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై విచారణకు ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

  • నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ హైకోర్టులో పిల్
  • విచారణ జరపాలని ఇంటర్ బోర్డును ఆదేశించిన హైకోర్టు
  • నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, ఈ రెండు కాలేజీలు పలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ రాజేష్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు... ఈ కాలేజీలపై పూర్థి స్థాయిలో విచారణ జరపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదికను తమకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News