Kodandarami Reddy: 23 లక్షల్లో తీసిన 'ఖైదీ' .. కొన్ని కోట్లు వసూలు చేసింది: దర్శకుడు కోదండరామిరెడ్డి

  • 'అభిలాష' భారీ విజయాన్ని అందుకుంది
  • నిర్మాతలకి నాపై నమ్మకం పెరిగింది 
  • చిరంజీవి లుక్ బాగా వచ్చిందన్న కోదండరామిరెడ్డి

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ, 'ఖైదీ' సినిమాను గురించి ప్రస్తావించారు. 'అభిలాష' సినిమా హిట్ కావడంతో, ఆ తరువాత సినిమా తమకి చేసిపెట్టమంటూ మా నెల్లూరు నిర్మాతలంతా వచ్చారు. ఎలాంటి సబ్జెక్ట్ అయినా .. ఎంత ఖర్చు అయినా ఫరవాలేదన్నారు. దాంతో రకరకాల కథలను పరిశీలించాము.

చివరికి 'రాంబో' ఫస్టు బ్లడ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నాము. ఆ సినిమాలోని రెండు మూడు సీన్లను తీసుకుని డెవలప్ చేద్దామని భావించాము. తర్జన భర్జనలుపడి ఫ్లాష్ బ్యాక్ ను ఓకే చేసుకున్నాము. చిరంజీవికి అనుకున్న గెటప్ బాగా సెట్ కావడంతో, మాకు ఆ కథపై నమ్మకం పెరుగుతూ వచ్చింది. పాటలు మినహా 30 రోజుల్లో షూటింగును పూర్తిచేశాము. మొత్తంగా 23 లక్షలు ఖర్చుకాగా కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసింది. దర్శకుడిగా ఈ సినిమా నా స్థాయిని పెంచింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News