Chiranjeevi: చిరూ .. కొరటాల సినిమా అప్ డేట్స్

  • ముగింపు దశకి చేరుకున్న ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • కథానాయికగా తెరపైకి 'త్రిష' పేరు 
  • వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల

చిరంజీవి .. కొరటాల కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ స్టోరీతో కొరటాల స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకి చేరుకున్నాయి. దాంతో రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు చకచకా చేసుకుంటున్నారు.

ఈ సినిమా షూటింగును 6 నెలలలో పూర్తిచేసి, ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో చిరంజీవి - కొరటాల వున్నారని అంటున్నారు. దాదాపు ఇదే తేదీ ఖరారు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్ మార్చుకున్నారు. తను ద్విపాత్రాభినయం చేయనున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు కూడా. వినోదం .. సందేశం కలగలిసిన ఈ సినిమాలో కథానాయికగా 'త్రిష' పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

More Telugu News