mamata banerjee: రండి.. కదలి రండి.. పోరాడదాం: కోల్ కతాలో మమతా బెనర్జీ మెగా ర్యాలీ

  • ట్వీట్లు చేసిన మమత 
  • సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ ర్యాలీ 
  • శాంతియుతంగా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొందామని పిలుపు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లను వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కోల్‌కతాలో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఆమె ఈ రోజు ట్వీట్ చేశారు.

'రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొందాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కదలి రండి. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై కోల్ కతాలో మెగార్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం రెడ్ రోడ్ లోని  బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి  ఈ ర్యాలీ ప్రారంభమై జోరాసంకో ఠాకుర్బారీ వద్ద ముగుస్తుంది' అని మమతా బెనర్జీ ట్వీట్లు చేశారు.

More Telugu News