Lalu prasad yadav: లాలు కుటుంబాన్ని రోడ్డున పడేస్తా: ఐశ్వర్య తండ్రి హెచ్చరిక

  • రబ్రీదేవిని జైలుకు పంపిస్తా
  • నా కుమార్తె జీవితాన్ని నాశనం చేశారు
  • తిండి కూడా పెట్టకుండా వేధించారు

తన కుమార్తెను గెంటేసిన లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని రోడ్డున పడేస్తానని ఐశ్వర్యరాయ్ తండ్రి చంద్రికారాయ్ హెచ్చరించారు. లాలు కుమారుడు తేజ్ ప్రతాప్ భార్య అయిన ఐశ్వర్య.. తనను వేధిస్తున్నారంటూ రబ్రీదేవిపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను జుట్టు పట్టుకుని కొట్టారని, బాడీగార్డులతో ఇంటి నుంచి గెంటేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.

విషయం తెలిసిన ఐశ్వర్య భర్త చంద్రికారాయ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తన కుమార్తెను వేధిస్తున్న లాలు కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తానని, రబ్రీదేవిని జైలుకు పంపుతానని హెచ్చరించారు. లాలు కుటుంబ సభ్యులందరూ కలిసి తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రే తన కుమార్తెను ఇలా వేధిస్తుంటే, రాష్ట్రంలోని మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లాలు కుటుంబ సభ్యులందరూ వికృత మనస్తత్వం కలిగిన వారేనని, తమ కుమార్తెకు భోజనం కూడా పెట్టేవారు కాదని ఐశ్వర్య తల్లి పూర్ణిమారాయ్ ఆరోపించారు.

More Telugu News