Forbes: ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్

  • టాప్-100 జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
  • నిర్మలతో పాటు రోష్నీ నాడార్, కిరణ్ మజుందార్ షాలకు స్థానం
  • అగ్రస్థానంలో ఏంజెలా మెర్కెల్

అంతర్జాతీయంగా పేరొందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా ప్రపంచ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. ఈ టాప్-100 జాబితాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా స్థానం కల్పించారు. ఫోర్బ్స్ జాబితాలో నిర్మల 34వ స్థానంలో నిలిచారు. భారత్ నుంచి హెచ్ సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోష్నీ నాడార్ కు ఈ జాబితాలో 54వ స్థానం దక్కింది. బయోకాన్ పరిశ్రమల అధినేత్రి కిరణ్ మజుందార్ షా 65వ స్థానంలో ఉన్నారు.

ఇక ఈ జాబితాలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు క్రిస్టినే లగార్డే, మూడో స్థానంలో అమెరికా పార్లమెంటు (హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్) స్పీకర్ నాన్సీ పెలోసి ఉన్నారు.

More Telugu News