Tirumala: తిరుమల ఆలయం ముందు ఘోరం... పాల లారీ కిందపడి భక్తుడి మృతి!

  • శ్రీవారి ఆలయం ముందే ఘటన
  • వేగంగా దూసుకొచ్చిన లారీ
  • డ్రైవర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందు ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఆలయానికి పాలను తీసుకు వస్తున్న లారీ వేగంగా రావడంతో, ఓ భక్తుడు దాని కిందపడి దుర్మరణం చెందాడు. అనుకోని ఈ దుర్ఘటనతో అక్కడే ఉన్న భక్తుల్లో ఆందోళన కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన వ్యక్తితో మరెవరూ లేకపోవడంతో అతను ఎవరన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.

More Telugu News