Telugudesam: సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారంటూ స్పీకర్ కు టీడీపీ వినతిపత్రం

  • తమ పార్టీకి జరుగుతున్న అన్యాయాలపై వినతిపత్రం
  • సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన 
  • ప్రజాస్వామ్య విధానాలను కాపాడాలంటూ విజ్ఞప్తి

గత రెండ్రోజులుగా శాసనసభలో తమకు జరుగుతున్న అన్యాయాలపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలసి ఓ వినతిపత్రం సమర్పించారు. శాసనసభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, తమ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సభ్యుడికి ప్రత్యేకంగా సీటు కేటాయించడం.. వంటి అంశాలను ఉటంకిస్తూ, సభా సంప్రదాయాల ఉల్లంఘనలను పేర్కొంటూ, ప్రజాస్వామ్య విధానాలను కాపాడాలని ఆ వినతి పత్రంలో స్పీకర్ ను టీడీపీ సభ్యులు కోరారు.

More Telugu News