TRS: పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల నిరసన

  • జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఆందోళన
  • ఉభయసభల్లో వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన టీఆర్ఎస్

పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి నిధులు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు.

ఇదే అంశంపై ఈ నెల 7వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని లేఖలో కేసీఆర్ కోరారు.

More Telugu News