Andhra Pradesh: రేపు ఆర్టీసీ డిపోల ఎదుట టీడీపీ నిరసన కార్యక్రమాలు

  • ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు రేపటి నుంచి అమలు
  • ఛార్జీల పెంపుపై టీడీపీ మండిపాటు
  • రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు

ఏపీలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసనకు దిగనున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు టీడీపీ పిలుపు నిచ్చింది. సచివాలయం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు నిరసనకు దిగనున్నారు.

More Telugu News