Karnataka: కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ డబుల్ సిక్సర్.. 11 మందికి మంత్రి పదవులు ఇస్తామన్న యెడ్డీ

  • 12 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ
  • ఘన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన యడియూరప్ప
  • రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్తున్నానంటూ వ్యాఖ్య

కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ డబుల్ సిక్సర్ నమోదు చేసింది. అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆరు స్థానాల్లో విజయం సాధించాల్సిన తరుణంలో... ఏకంగా 12 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. జేడీఎస్ ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.

ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ గెలుపు కోసం అన్నీ తానై సర్వ శక్తులను ఒడ్డిన ముఖ్యమంత్రి యడియూరప్ప... తమ పార్టీ ఘన విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 11 మందికి మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. ఇదే విషయంపై హైకమాండ్ తో మాట్లాడేందుకు రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళతానని చెప్పారు.

More Telugu News