nirbhaya: నిర్భయ అత్యాచారానికి గురైన డిసెంబర్‌ 16నే దోషులకు ఉరిశిక్ష అమలు!

  • వెల్లడించిన తిహార్ జైలు అధికారులు
  • కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు 
  • నలుగురికి ఉరి శిక్ష

అది 2012, డిసెంబర్‌ 16వ తేదీ.. ఢిల్లీలో ఆరుగురు మృగాళ్లు నిర్భయపై దాడి చేసి అత్యాచారం చేశారు. యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిర్భయ మృతి చెందింది. ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16నే ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు.

ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు చెప్పారు. తమకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆదేశాలు అందినట్లు తెలిపారు. ప్రస్తుతం దోషులు తిహార్‌ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు  చేసుకుంటున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు జూవైనల్‌ కోర్టు విధించిన శిక్ష అనుభవించాడు. మరో దోషి రామ్‌సింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దోషులకు శిక్ష అమలులో జరిగిన ఆలస్యంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News