ముగిసిన బీఏసీ సమావేశం.. 7 రోజులు మాత్రమే కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • సమావేశానికి హాజరైన జగన్, అచ్చెన్నాయుడు
  • సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై ప్రధాన చర్చ
  • 17 వరకు సభను నిర్వహించాలని నిర్ణయం
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన కొనసాగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిపక్షం నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నెల 17వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీకి సెలవు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రారంభమైన సమావేశాలు కేవలం 7 రోజులు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 11, 12, 13, 16, 17 తేదీల్లో సభ సమావేశంకానుంది. మరోవైపు, సభలో దురుసుగా ప్రవర్తిస్తూ వెల్ లోకి సభ్యులు దూసుకురావడంపై కూడా చర్చ జరిగింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Go Back to Shorts
AP Assembly
BAC Meeting

More Telugu News