ap assembly: హోదా రాకపోవడానికి టీడీపీ స్వార్థ వైఖరే కారణం: వైసీపీ ఎమ్మెల్యే కాకాణి

  • ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి హోదా సాధించలేదే
  • సిగ్గు లేకుండా హోదా కోసం అంటూ దొంగ దీక్షలు, ధర్నాలు
  • ప్యాకేజీకి ఒప్పుకున్నది వారే కదా

ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ అనుసరించిన స్వార్థ వైఖరే కారణం అని, దీనిపై వారు సిగ్గు పడాలని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.

ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేకహోదా సాధించలేనందుకు సిగ్గు పడాల్సిందిపోయి, హోదా కోసమంటూ దొంగ పోరాటాలు, దీక్షలు చేసిందంటూ విరుచుకు పడ్డారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి, ప్యాకేజీకి ఒప్పుకున్నది టీడీపీ కాదా? అని ఆ పార్టీని ప్రశ్నించారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

More Telugu News