AP assembly: ఈసారీ వాడి...వేడిగానేనా? : రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

  • పది రోజుల పాటు జరగనున్న సభ
  • కీలక అంశాలను చర్చకు తేనున్న ప్రభుత్వం
  • సర్కారును కడిగిపారేయాలని విపక్షం అస్త్రాలు

శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మొదలుకానున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన బడ్జెట్‌ సమావేశాలు హాట్‌ హాట్‌గా సాగిన విషయం తెలిసిందే. ఈసారి పరిస్థితి మరింత వాడి...వేడిగా ఉండే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా. పది రోజులపాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శాసన సభ సలహా మండలి (బీసీఏ) సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించినా అనివార్య కారణాల వల్ల సోమవారానికి దీన్ని వాయిదా వేశారు. తొలుత దిశ హత్యోదంతంపై చర్చ అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవుతుంది.

పలు కీలక అంశాలను చర్చకు ఉంచడంతోపాటు మూడు నుంచి ఐదు బిల్లులను సభ ఆమోదానికి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పాఠశాల విద్యలో ఆంగ్ల మాధ్యమం, తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయడం, ప్రభుత్వ పనుల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్‌, నామినేటెడ్‌ పదవులు తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా నిలదీసేందుకు విపక్ష టీడీపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది.

More Telugu News