ప్రజలు నన్ను నమ్మారు... ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వను: రజనీకాంత్
- చెన్నైలో 'దర్బార్' పాటల పండగ
- ప్రజల్లో ప్రతికూల ధోరణి పెరిగింది
- సానుకూలత అలవరచుకోవాలన్న రజనీ
ఆపై మద్రాసులో బాలచందర్ తనను విశ్వసించారని, ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించానని అన్నారు. ఇప్పుడు తమిళ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్నీ గెలిపిస్తానని అన్నారు. నేటి తరంలో అందరూ ప్రతికూల ధోరణితో ఆలోచిస్తున్నారని, మీడియా కూడా అలాగే ఉందని అభిప్రాయపడ్డ రజనీ, సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలని కోరారు. 'దర్బార్' సినిమా కథ తన వద్దకు 'శివాజీ' షూటింగ్ సమయంలోనే వచ్చిందని, మురుగదాస్ ఈ స్టోరీని ఎంతో చక్కగా తెరకెక్కించారని అన్నారు. 'దళపతి' సినిమా తీసిన 29 సంవత్సరాల తరువాత తిరిగి సంతోష్ శివన్ తన చిత్రానికి పని చేశారని చెప్పారు.
ఇదే ఫంక్షన్ లో మురుగదాస్ మాట్లాడుతూ, తాను ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్నీ రజనీని దృష్టిలో ఉంచుకునే రాశానని, ఆయన్ను దర్శకత్వం చేయడమంటే, తనకు చంద్రమండలానికి వెళ్లినంత సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు అనిరుధ్, రజనీ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అరుణ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.