‘లేక్ వ్యూ’ ఓఎస్డీగా పి.వి. సింధు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- సీసీఎల్ఏలో డిప్యూటీ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకున్న సింధు
- టోక్యో ఒలింపిక్స్ కోసం 2020 ఆగస్ట్ వరకూ ఆన్ డ్యూటీ లీవ్
- ఇటీవల అమరావతిలో సీఎం జగన్ తో భేటీ
ఈ పోస్ట్ ను ఆమెకు కేటాయించడానికి ప్రొటోకాల్ విభాగంలోని సహాయ డైరెక్టర్ హోదాను పెంచింది ప్రభుత్వం. చార్జ్ తీసుకున్న అనంతరం ఆమె 2020 ఆగస్ట్ నెల వరకూ ఆన్ డ్యూటీ లీవ్ లో ఉంటారు. ఈ సమయంలో ఆమె టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ కు సిద్ధం కావటానికి వెళతారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని అమరావతిలోని ఆయన నివాసంలో కలిసిన పి.వి. సింధు, ఆన్ డ్యూటీ లీవ్ పర్మిషన్ కు ఆమోదం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.