Sajjannar: ఎన్ కౌంటర్ పై సజ్జనార్ అధికారిక ప్రకటన!

  • ధ్రువీకరించిన సజ్జనార్
  • 3 నుంచి 6 గంటల మధ్య ఘటన
  • కాసేపట్లో మరిన్ని వివరాలు

దిశపై హత్యాచారం జరిపిన నిందితుల ఎన్ కౌంటర్ ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ధ్రువీకరించారు. "నిందితులు మహమ్మద్ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు ఈ తెల్లవారుజామున షాద్ నగర్, చటాన్ పల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన 3 నుంచి 6 గంటల మధ్య జరిగిందని తెలిపారు. తాను ఘటనా స్థలికి వెళ్లానని, మరిన్ని వివరాలను తరువాత తెలియజేస్తానని అన్నారు.

కాగా, మామూలుగా ఎన్ కౌంటర్లను ఖండించే సీపీఐ నేత నారాయణ సైతం దిశ హంతకుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారు. ఈ ఎన్ కౌంటర్ ను తాను విమర్శించబోనని, ఇటువంటివి జరిగితేనే మరోసారి దారుణాలు జరుగకుండా ఉంటాయని ఆయన అన్నారు. అత్యాచారాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలు సమర్థనీయమేనని ఆయన ఈ ఉదయం వ్యాఖ్యానించారు.

More Telugu News