Arvind Kejriwal: కేజ్రీవాల్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు: గౌతం గంభీర్ విమర్శలు

  • ప్రజలకు మరోసారి అసత్యాలు చెప్పారు 
  • నాలుగున్నరేళ్ల క్రితం ఉచిత వైఫై అంటూ హామీ ఇచ్చారు 
  • ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలోనే మళ్లీ ఈ హామీ ఇస్తున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని బస్టాపులు, మార్కెట్ ప్రాంతాల్లో తాము ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని తాజాగా కేజ్రీవాల్ ప్రకటించారు. మొత్తం 11,000 ప్రాంతాల్లో త్వరలోనే ఈ సదుపాయాన్ని అందుకోవచ్చని చెప్పారు.

దీనిపై గౌతం గంభీర్ స్పందిస్తూ... 'ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి మరోసారి అసత్యాలు చెప్పారు. ఆయన అబద్ధాలకోరు. నాలుగున్నరేళ్ల క్రితం కూడా ఆయన ఇటువంటి హామీయే ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలే ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ హామీని ఇస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలోనే ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు' అని విమర్శించారు.

More Telugu News