బీజేపీ కంటే శివసేనతో కలిసి పనిచేయడమే ఈజీ: శరద్ పవార్
- బీజేపీతో పని చేయడం సిద్ధాంతపరంగా కష్టతరం
- శివసేన తన హిందుత్వను పరిపాలనలోకి తీసుకురాదు
- కాంగ్రెస్ తో మాకు ముందు నుంచి పొత్తు ఉంది
ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా కలిసి పనిచేద్దామని ఆయన ప్రతిపాదించారని... అయితే విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన నేపథ్యంలో అది సాధ్యం కాదని తాను చెప్పానని శరద్ పవార్ తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇస్తామని... కానీ, రాజకీయాలను అందులోకి లాగకూడదని అన్నారు. తమది కూడా ఒక రాజకీయ పార్టీనేనని చెప్పారు. కాంగ్రెస్ తో తమకు పొత్తు ఉందని... దాన్ని, విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన తనకు లేదని తెలిపారు.