Allu Arjun: 'అల వైకుంఠపురములో' గురించి ఫిల్మ్ నగర్ టాక్

  • ముగింపు దశలో 'అల వైకుంఠపురములో'
  • ఎన్టీఆర్ 'ఇంటిగుట్టు'కు రీమేక్ అని టాక్ 
  • మలయాళ మూవీ నుంచి ప్రేరణ అంటూ ప్రచారం

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. 'టబు' కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ - సావిత్రి జంటగా తెరకెక్కిన 'ఇంటిగుట్టు' సినిమాను ఈ జనరేషన్ కి తగినట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

'ఇంటిగుట్టు'లో ఓ కేసును ఛేదించడం కోసం ఎన్టీఆర్ .. సావిత్రి ఇంట్లో కారు డ్రైవర్ గా చేరతాడు. అతనికి సావిత్రి బాస్ గా వ్యవహరిస్తుంది. ఇక 'అల వైకుంఠపురములో' సినిమాపై మలయాళ మూవీ 'మైబాస్' ప్రభావం కూడా ఉందనేది తాజా సమాచారం. దిలీప్ - మమతా మోహన్ దాస్ జంటగా నటించిన ఆ సినిమాకి .. ఈ సినిమాకి చాలా దగ్గర పోలికలు ఉంటాయని చెప్పుకుంటున్నారు. పాత కథల్లోని పాయింట్ పట్టుకుని దానిని తనదైన స్టైల్లో ఆవిష్కరించడం త్రివిక్రమ్ కి అలవాటేననే విషయం తెలిసిందే.

More Telugu News