Sajjannar: 'దిశ'కు న్యాయం చేసి చూపిస్తా: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జన్నార్

  • నిందితులకు త్వరితగతిన శిక్షలు
  • అనుభవమున్న అధికారులను నియమించాం
  • బలమైన సాక్ష్యాలు తయారు చేస్తున్నామన్న సజ్జన్నార్

హైదరాబాద్ శివార్లలో దారుణ హత్యాచారానికి గురైన దిశకు తప్పకుండా న్యాయం జరుగుతుందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జన్నార్ వ్యాఖ్యానించారు. నిందితులందరికీ త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎంతో అనుభవమున్న అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశామని, వారు బలమైన సాక్ష్యాధారాలను తయారు చేస్తున్నారని అన్నారు.

కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో దిశపై వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఫేస్ బుక్ లో దిశపై అనుచితంగా పోస్టులు పెట్టిన ఫకీరాబాద్‌ కు చెందిన యువకుడు చావన్‌ శ్రీరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News