Andhra Pradesh: ఏపీలో నూతన మద్యం పాలసీపై హైకోర్టు స్టే.. వివరణ ఇవ్వాలని ఆదేశాలు!

  • ఈ నెల 23 వరకు మద్యం పాలసీపై ముందుకెళ్లొద్దు
  • తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు
  • ఈ నెల 9 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు

ఏపీలో నూతన మద్యం పాలసీకి హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ నెల 23 వరకు మద్యం పాలసీపై ముందుకు వెళ్లకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన మద్యం పాలసీ డిజైన్ చేశారు? మద్యం రిటైల్ ధరలు ప్రభుత్వం చేతిలో ఉంటాయా? బార్లకు అంత ధరలు ఎలా నిర్ణయిస్తారు? అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ అంశంపై ఈ నెల 9వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని, 16వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

More Telugu News