Padmaja: మహిళా రైతు పద్మజను విడుదల చేసిన పోలీసులు

  • బొత్స, కొడాలి నానిలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పద్మజ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ శ్రేణులు 
  • ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నానిలను దుర్భాషలాడిందన్న కారణంతో మహిళారైతు పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆమెను కంచికచర్ల పోలీసులు విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారు.

గత నెల 26న యర్రబాలెంలో రాజధాని అమరావతిపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పద్మజ మాట్లాడుతూ బొత్స, కొడాలి నానిలను విమర్శిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, ఆమెపై వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పద్మజకు పోలీసులు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు. ఈ ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  

More Telugu News