Sai Dharam Tej: 'ప్రతిరోజూ పండగే' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

  • మారుతి నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 
  •  ఈ నెల 4వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • ఈనెల 20వ తేదీన సినిమా విడుదల 

మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా 'ప్రతిరోజూ పండగే' సినిమా రూపొందింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను నిర్మించారు. సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ గా డిసెంబర్ 4వ తేదీని ఖరారు చేశారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో రావు రమేశ్ .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' భారీ విజయాన్ని నమోదు చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై అందరిలోను ఆసక్తి వుంది.

More Telugu News