KCR: నేడు ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్.. మోదీతో భేటీ అయ్యే అవకాశం!

  • అమిత్ షా, రాజ్ నాథ్, గడ్కరీలతో భేటీ కానున్న కేసీఆర్
  • పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం
  • రేపు మోదీతో భేటీ అయ్యే అవకాశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ప్రధాని మోదీతో రేపు ఆయన సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సమావేశాల సందర్భంగా... కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సెక్రటేరియట్ కు రక్షణ భూముల కేటాయింపు, విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన వాటితో పాటు వివిధ కీలక అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

More Telugu News