Amaravathi: అమరావతి మండలం ధరణికోటలో భారీ మోసం!

  • రమేశ్ అనే వ్యక్తికి వెంకటేశ్వరరావు చౌదరి బెదిరింపులు
  • విలువైన భూమిని తన పేరిట రాయించుకున్నాడు
  • ఎవరికైనా చెబితే రమేశ్ పిల్లలను చంపేస్తానని బెదిరింపు

గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని ధరణికోటలో భారీ మోసం జరిగింది. రమేశ్ అనే వ్యక్తిని వెంకటేశ్వరరావు చౌదరి అపహరించి, రూ.10 కోట్ల విలువైన 6.33 ఎకరాల పంట భూమిని తన పేరిట రాయించుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అతని పిల్లలను చంపేస్తానని వెంకటేశ్వరరావు బెదిరించాడు. అయితే, ఈ బెదిరింపులకు భయపడని రమేశ్, గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News