Archery ChampionSHip: ఆసియా ఆర్చరీ రికర్వు ఈవెంట్లో భారత్ కు ఒక స్వర్ణం, ఒక రజతం

  • దీపిక కు స్వర్ణం, అంకితకు రజతం
  • ఫైనల్లో అంకితపై 6-0తో దీపిక విజయం
  • సెమీస్ చేరడంతోనే వీరిద్దరికీ ఒలింపిక్స్ బెర్త్ లు ఖరారు

బ్యాంకాక్ వేదికగా సాగుతున్న ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత ఆర్చర్లు ఈ రోజు ఒక స్వర్ణం, రజతం గెలుచుకున్నారు. వ్యక్తిగత రికర్వు ఈవెంట్ ఫైనల్ పోటీ ఇద్దరు భారత ఆర్చర్ల మధ్యే సాగింది. దీపికా కుమారి 6-0 తేడాతో అంకితపై విజయం సాధించింది. దీపికా కుమారి స్వర్ణం గెలుచుకోగా, ఆమె సహచర క్రీడాకారిణి అంకిత భక్త్ రజత పతకాన్ని అందుకుంది. ఈ చాంపియన్స్ షిప్స్ లో సెమీస్ చేరడంతోనే.. వీరిద్దరూ ఒలింపిక్స్ వ్యక్తిగత రికర్వు బెర్త్ లను ఖరారు చేసుకున్నారు.

More Telugu News