Rajani: మళ్లీ ఇంతకాలానికి రజనీ సరసన ఖుష్బూ

  • విడుదలకి ముస్తాబవుతున్న 'దర్బార్'
  • రజనీ తదుపరి సినిమాకి సన్నాహాలు 
  •  గతంలో రజనీ జోడీగా మెప్పించిన ఖుష్బూ

రజనీకాంత్ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'దర్బార్' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక వైపున ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో వైపున తన 168వ సినిమా కోసం రజనీ సిద్ధమవుతున్నారు. శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో రజనీ సరసన 'ఖుష్బూ' కనిపించనున్నట్టు సమాచారం.

కొంతకాలంగా రజనీ తన సినిమాల్లో కుర్ర హీరోయిన్లు కాకుండా సీనియర్ హీరోయిన్స్ వుండేలా చూసుకుంటున్నారు. ఈ కారణంగానే 'కాలా'లో ఈశ్వరీరావు .. 'పేటా'లో సిమ్రాన్ ఆయన సరసన కనిపించారు. ఈ సారి ఖుష్బూను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో రజనీ - ఖుష్బూ కాంబినేషన్లో వచ్చిన 'అన్నామలై' .. 'మన్నన్' .. 'పాండియన్' చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. మళ్లీ ఇంతకాలానికి ఈ జోడీని తెరపై చూసే అవకాశం లభించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.

More Telugu News