సొంత పార్టీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పై కఠిన చర్యలు చేపట్టిన బీజేపీ!
- రక్షణ శాఖ కమిటీ నుంచి తొలగింపు
- శీతాకాల సమావేశాల నుంచి సస్పెన్షన్
- నిన్న గాడ్సేను దేశభక్తుడనడంతో తీవ్ర దుమారం
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు ఆమెను ఆహ్వానించబోవడం లేదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ శీతాకాల సమావేశాల నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు లోక్ సభ ప్రకటించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవేనని ఈ సందర్భంగా జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. తమ పార్టీ అటువంటి వ్యాఖ్యలను సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఈ ఉదయం కూడా ప్రజ్ఞా వ్యాఖ్యలు ఉభయ సభలను కుదిపేశాయి. ఆమెను పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని, ఆమె క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్షాలు వాకౌట్ చేశాయి.