Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 199 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 63 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 7 శాతానికి పైగా పెరిగిన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగవుతున్నాయనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021కి ఎగబాకింది. నిఫ్టీ 63 పాయింట్లు లాభపడి 12,101కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (7.65%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.43%), మారుతి సుజుకి (2.38%), సన్ ఫార్మా (1.87%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.78%).

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-1.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.07%), ఐటీసీ (-0.86%), టాటా స్టీల్ (-0.81%), ఎన్టీపీసీ (-0.51%).

More Telugu News