Srinivas: 'మథనం' మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • మరో ప్రేమకథా చిత్రంగా 'మథనం'
  • నాయకానాయికల తొలిపరిచయం 
  • ప్రతినాయకుడి పాత్రలో అజయ్

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి 'మథనం' టైటిల్ తో మరో ప్రేమకథ రూపొందుతోంది. శ్రీనివాస్ సాయి .. భావనారావు నాయకా నాయికలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాతో హీరోహీరోయిన్లు మాత్రమే కాదు, దర్శకుడిగా అజయ్ సాయి మణికందన్ కూడా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

'చందమామ .. చందమామ నన్నే చూసింది .. మళ్లీ నేనే పుట్టాలనే ఆశే పూసింది' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రియురాలిని గుర్తుచేసుకుంటూ .. ఆమె ఎడబాటుకు తల్లడిల్లుతూ ప్రియుడు పాడుకునే ఎమోషనల్ సాంగ్ ఇది. రాన్ ఈథన్ యోహాన్ స్వరకల్పన .. పూర్ణచారి సాహిత్యం .. కార్తీక్ ఆలాపన ఆకట్టుకునేలావున్నాయి. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో ప్రతినాయకుడిగా అజయ్ కనిపించనున్నాడు.

More Telugu News