Chandrababu: చంద్రబాబూ... మరి ఇన్నాళ్లూ వచ్చిన డబ్బు ఎవరి జేబులోకి వెళ్లింది?: విజయసాయి రెడ్డి

  • వారం రోజుల్లో ఇసుకను అమ్మితే రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది
  • ఇదే ఆదాయం వస్తే, ఏటా వేల కోట్ల ఆదాయం వస్తుంది
  • ఇన్నాళ్లూ తినేశారా? అని ప్రశ్నాస్త్రాలు
కేవలం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం స్పందించిన ఆయన, "వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే ఇది వేల కోట్లలోకి వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది చంద్రబాబు గారూ? పచ్చ ఇసుక మాఫియా ద్వారా మీకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారు" అని ఆయన విమర్శలు గుప్పించారు.
Chandrababu
Twitter
Vijay Sai Reddy
Sand

More Telugu News