Nikhil: నా సినిమా వాయిదాకి ఆర్థికపరమైన ఇబ్బందులు కారణం కాదు: నిఖిల్

  • నిఖిల్ హీరోగా 'అర్జున్ సురవరం'
  • హిట్ ఖాయమంటున్న నిఖిల్ 
  • ఈ నెల 29వ తేదీన విడుదల

నిఖిల్ కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో 'అర్జున్ సురవరం' రూపొందింది. రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాను గురించి నిఖిల్ మాట్లాడుతూ .."ఈ సినిమా యూనివర్సల్ పాయింట్ తో రూపొందింది. భాషతో .. ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ ఎదుర్కుంటున్న సమస్యను ఇందులో చూపించాము.

ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగింది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా అవి ఆర్థికపరమైన సమస్యలు కావు. చిన్నచిన్న అవాంతరాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సారి మాత్రం చెప్పిన తేదీకి కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తాము. తప్పకుండా హిట్ కొడతామని నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News