Andhra Pradesh: ఏపీ-తమిళనాడు సరిహద్దులో నిలిచిపోయిన పినాకిని ఎక్స్ ప్రెస్

  • రైలుకు సాంకేతిక సమస్యలు
  • 2 గంటలకు పైగా నిలిచిపోయిన వైనం
  • చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న పినాకిని

చెన్నై నుంచి విజయవాడ వస్తున్న పినాకిని ఎక్స్ ప్రెస్ రైలు మార్గమధ్యంలో నిలిచిపోయింది. ఏపీ-తమిళనాడు సరిహద్దులో కవరపేట వద్ద ఈ రైలు సాంకేతిక సమస్యలతో నిలిచింది. దాదాపు రెండు గంటల నుంచి రైలు కవరపేట వద్దే నిలిచిపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. సాంకేతిక సమస్యలను చక్కదిద్దేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News