digvijay singh: అజిత్ పవార్ ఒంటరి అయ్యారు.. ఇక శరద్ పవార్ రాజకీయ వారసురాలివి నువ్వే: దిగ్విజయ్ సింగ్

  • ఎన్సీపీ నుంచి 54 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు
  • వారిలో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు
  • అజిత్ పవార్ ఒంటరి అయ్యారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీని మోసం చేస్తూ అజిత్ పవార్ సొంత నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే అజిత్ పవార్ పై ఆ పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక శరద్ పవార్ రాజకీయ వారసురాలు ఆయన కూతురు సుప్రియా సూలెనే అంటూ ట్వీట్ చేశారు.  

‘ఎన్సీపీ నుంచి గెలిచిన 54 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు. అజిత్ పవార్ ఒంటరి అయ్యారు. ఇప్పుడు శరద్ పవార్ వారసురాలివి నువ్వే  సుప్రియ సూలె' అంటూ దిగ్విజయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

More Telugu News