nama nageswara rao: లోక్‌సభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్, వైసీపీ ఎంపీల నియామకం

  • బులెటిన్ విడుదల చేసిన లోక్‌సభ సచివాలయం
  • కమిటీలో మొత్తం 45 మంది సభ్యులు
  • ప్రత్యేక ఆహ్వానితులుగా పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్‌ రెడ్డి, రఘురామ కృష్ణంరాజులు లోక్‌సభ జనరల్‌ పర్పస్‌ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. లోక్‌సభ స్పీకర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో మొత్తం 45 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ శాఖ సహాయ మంత్రులు అర్జున్‌‌రాం మేఘవాల్‌, వి.మురళీధరన్‌‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ నామా, వైసీపీ ఎంపీలను కమిటీ సభ్యులుగా నియమించినట్టు శనివారం లోక్‌సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది.

More Telugu News