సుప్రీంకు చేరిన మహారాష్ట్ర రాజకీయం... ప్రభుత్వ ఏర్పాటుపై పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ
- మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు
- తమకు 144 మందికి పైగా మద్దతు ఉందన్న కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ
- తమకు అవకాశమిచ్చేలా గవర్నర్ ను ఆదేశించాలని విజ్ఞప్తి
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవడంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఈ ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ నుంచి వేరుపడిన అజిత్ పవార్ వర్గం బీజేపీకి మద్దతు పలకడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే.