Telugudesam: పప్పు కంటే చిప్పకూడు తినడం దారుణం: టీడీపీ నేత మాణిక్యాలరావు

  • చిప్పకూడు తినడం కన్నా భాష రాకపోవడం తప్పేమీ కాదు
  • జగన్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు
  • కొడాలి నాని ఓ రౌడీలా ప్రవర్తించారు

టీడీపీ నేత నారా లోకేశ్ ను ‘పప్పు’గా అభివర్ణిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం నేత పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘పప్పు’ కంటే చిప్పకూడు దారుణమైందని అన్నారు. చిప్పకూడు తినడం కంటే భాష రాకపోవడం పెద్ద తప్పేమీ కాదంటూ పరోక్షంగా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా కొడాలి నానికి ఓ హెచ్చరిక చేశారు. రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం ఇస్తామన్న హామీ గురించి తమ నాయకుడు ఒకరు ప్రస్తావిస్తే.. నాని బూతుల పురాణం మాట్లాడారని, ఓ రౌడీలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఒక వ్యక్తి ప్రశ్నిస్తేనే నాని ఇలా మాట్లాడారే, రేపు రాష్ట్ర ప్రజలందరూ ఈ హామీ విషయమై నిలదీస్తే ఇదే బూతుపురాణం మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఇదే విధంగా ప్రజలతో మాట్లాడతానంటే బట్టలూడదీసి తంతారన్న సంగతిని నాని గుర్తుపెట్టుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్కూల్ కు వెళ్లే పిల్లవాడు తనకు ఉన్న మంచిబట్టలు వేసుకుని వెళతాడని, అసెంబ్లీకి వెళుతున్న కొడాలి నానికి ఆ గడ్డమేంటి? అవతారమేంటి? నీ భాష, ప్రవర్తన ఏంటి? అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని, వాళ్లకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వుందని అన్నారు. నువ్వు ఒక మంత్రిగా కొనసాగాలనుకుంటే నీ భాష, బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే, తగిన మూల్యం చెల్లించే రోజు తొందర్లోనే వుంది’ అని హెచ్చరించారు.

More Telugu News