Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది దుర్మరణం

  • జాతీయ రహదారిపై బస్సు-లారీ ఢీ
  • గాయపడిన 25 మందితో మరికొందరి పరిస్థితి విషమం
  • బికనేర్ జిల్లా శ్రీదంగర్‌గఢ్ సమీపంలో ఘటన

రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. బికనేర్ జిల్లా శ్రీదంగర్‌గఢ్ సమీపంలో బస్సు-లారీ ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

More Telugu News