Nithin: 'భీష్మ' విడుదల తేదీపై సందేహాలు!

  • షూటింగు దశలో 'భీష్మ'
  • నితిన్ జోడీగా రష్మిక 
  • విడుదల విషయంలో ఆలోచన

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'భీష్మ'రూపొందుతోంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని భావించారు. అయితే షూటింగ్ పరమైన జాప్యం కారణంగా ఈ సినిమాను ఫిబ్రవరి 21వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 'శివరాత్రి' సెలవు రోజుని దృష్టిలో పెట్టుకుని అలా ప్లాన్ చేశారు.

అయితే అప్పటికే స్టూడెంట్స్ పరీక్షల మూడ్ లో వుంటారు. అందువలన ఫిబ్రవరి కంటే ముందుగానే ఈ సినిమాను విడుదల చేయడం మంచిదనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయట. మరి ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు దృష్టిలో పెట్టుకుని, విడుదల విషయంలో మనసు మార్చుకుంటారో .. అదే విడుదల తేదీని ఖరారు చేస్తారో చూడాలి. ఈ సినిమా పోస్టర్స్ చూసినవాళ్లు మాత్రం నితిన్ - రష్మిక జోడీ అదిరింది అంటున్నారు.

More Telugu News