Stone Attack: బనగానపల్లి టీడీపీ అభ్యర్థి భార్యపై రాళ్లదాడి

  • నంద్యాల జిల్లా బనగానపల్లిలో నెలకొన్న ఉద్రిక్తత
  • భర్త జనార్దనరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఇందిరమ్మ
  • వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి దాడి చేయించారని ఆరోపిస్తున్న టీడీపీ
Stone pelting on TDP Candidate spouse Indiramma


నంద్యాల జిల్లా బనగానపల్లిలో తెలుగుదేశం అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్ల దాడి చేసినట్లు టీడీపీ ఆరోపించింది. ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి వైసీపీ శ్రేణులను రెచ్చగొట్లినట్లు తెలుగు దేశం పార్టీ ఆరోపించింది. ఆవేశానికి లోనైన ఇరు పార్టీల వర్గాలు వాగ్వాదానికి దిగగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News